మేడారం భక్తులపై తేనెటీగల దాడి.. 25 మందికి గాయాలు

మేడారం భక్తులపై తేనెటీగల దాడి.. 25 మందికి గాయాలు

జనగామ జిల్లా: మేడారం వనదేవతల దర్శనానికి వెళ్లివస్తున్న వారిపై తేనెటీగలు దాడి చేశాయి. డీసీఎంలో ప్రయాణిస్తున్న వారిపై తేనెటీగలు మూకుముడిగా దాడి చేశాయి. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం సమయంలో వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారి రఘునాథపల్లి సమీపంలో  చోటుచేసుకుంది. దాడిలో దాదాపు 25 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

చికిత్స నిమిత్తం వారిని జనగామ జిల్లా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉండడంతో వారికి మాతశిశు సంక్షేమ ఆసుపత్రిలో డాక్టర్లు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. వారందరూ హైదరాబాద్ లోని అంబర్పేట్ కు చెందిన వారిగా గుర్తించారు. ప్రస్తుతం వారి హాస్పిటల్ లోనే ఉన్నారు.